Post Views: 51
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో మంగళవారం రోజు భారతదేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 106వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషిచేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు కాలేక్, గంగాధర్, కృష్ణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..