Post Views: 52
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రూప్-3 పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిసాయి. 20 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కాగా గ్రూప్ -3 మొదటి పరీక్షకు 8628 మంది అభ్యర్థులకు గాను 4655 మంది హాజరయ్యారని.. రెండవ పరీక్షకు 8268 మంది అభ్యర్థులకు గాను 4644 మంది హాజరైనట్లు రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. తొలిరోజు పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలియజేశారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..