Post Views: 61
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠ్యాంశాలు బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గునిగెరి హన్మండ్లు మాట్లాడుతూ బాలలకు విద్యార్థి దశ నుండే సామాజిక అంశాల పట్ల అవగాహన మరియు ఉపాధ్యాయ వృత్తిలో ఉండే సంతృప్తి గురించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాంచన, పుష్పలత, అనూష, స్వప్న, రూప మరియు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..