1,400 కోట్ల జీఎస్టీ ఎగవేతపై కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాజీ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ దూకుడు పెంచింది. ఈ జీఎస్టీ ఎగవేతపై శుక్రవారం 17 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ జీఎస్టీ కుంభకోణంలో మొత్తం 75 కంపెనీలపై పోలీసులు అభియోగాలు నమోదు చేయగా, వీటిలో పన్నులు ఎగవేసిన 17 సంస్థలకు తాజాగా నోటీసులు జారీ చేశారు.
ఇందులో ఏడుకొండలు లేబర్ కాంట్రాక్టర్ కో-ఆపరేటివ్ సొసైటీ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సంస్థ వాణిజ్య శాఖకు రూ.7.66 లక్షలు ఎగవేసినట్లు నోటీసులో పేర్కొన్నది. జూలై 1, 2017లో ఏడుకొండలు రిజిస్టర్ అవగా, మార్చి 20, 2023న తన రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకున్నది. ఈ మధ్యకాలంలో జీఎస్టీ రిటర్ను దాఖలు చేయడంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈ స్కామ్పై దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....