పోతంగల్ గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం 60 ట్రాక్టర్లను పట్టుకొని వాటిలోని ఇసుకను పొతంగల్ తాసిల్దార్ వేలం వెయ్యడం జరిగింది. ఆరు వేలకు ఆ ఇసుకను వేలం వేసినట్టు విశ్వాసనీయ సమాచారం. అయితే వేలం వేసిన ఇసుకను రాత్రి సమయంలో లారీల్లో నింపేసి పోతంగల్ దాటి నిజామాబాద్ పట్టణం దాటేసి మూడు లారీల్లో తీసుకెళ్లినట్టు కొందరు స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. మరి పొద్దున వరకు ఆ డంపును 60 ట్రాక్టర్ల భారతి చేశారాట మరి పొద్దున లీగల్గా వేబిల్ తీసుకొని ఆ ఇసుకను తీసుకెళ్లిపోయారట మరి రాత్రి సమయంలో ఆ ఇసుకను ఎలా తీసుకెళ్లారు అంటూ కొందరు స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి అదే విధంగా ఆదివారం చెక్పోస్టులు దాటి రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు ఎదుట నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలు వెళ్లినట్టు కొందరు చూసినట్టు చెబుతున్నారు. చెక్ పోస్టులు దాటి సరిహద్దులు దాటి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని కొందరు స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. నిజామాబాద్ పట్టణం చెందిన లారీలు వచ్చి కోటగిరి మీదగా వెళ్తున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఇప్పటి కైనా నిజామాబాదు జిల్లా స్థాయి అధికారులు పోతంగల్ జరుగుతున్న ఇసుక మాఫియా పై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోర్తున్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist