V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ పట్టణంలో సోమవారం రోజు SCSDF నిధులు 4 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే నిజామాబాద్ -వర్ని రోడ్డు మరియు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే నిజామాబాద్ -నర్సి రోడ్ల నిర్మాణానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు లు షబ్బీర్ అలీ పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందాన్ , నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..