Post Views: 37
V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జుక్కల్ మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలోని మున్నూరు కాపు గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్నేశ్వరుడి చేతిలో 11 రోజులపాటు పవిత్రమైన పూజలు అందుకున్న మహా ప్రసాదం లడ్డు రికార్డు స్థాయిలో రూ.1,41,000 ధర పలికింది. అస్పత్ వార్ అనిల్, మల్లయ్య లడ్డు ప్రసాదాన్ని వేలం పాటలో దక్కించుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి లడ్డు ప్రసాదాన్ని అందించి సన్మానించారు. అనంతరం వారు ప్రసాదాన్ని కైవసం చేసుకున్న వారికి ధన్యవాదాలు తెలిపి అభినందించారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..