శాంతి భద్రతలను కపాడటంలో రెవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం
రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం సెప్టెంబర్ 13:-
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి హేమమైన చర్య… శాంతి భద్రతలను కపాడటంలో రెవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం అయ్యందని… శాసనసభ్యున్నిపై జరిగిన దాడికి సిఎం రెవంత్ రెడ్డి క్షమపణ చేప్పాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తు గోదావరి బిడ్జిపై మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు రస్తరోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరికపూడి గాంధీ అనుచరులను వెంట వేసుకొని తోటి ఒక శాసనసభ్యుడిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. నేను కాంగ్రెస్ లో చేరలేదు ఇంకా బి ఆర్ ఎస్ పార్టీలోనే ఉన్న అన్న అరికపూడి గాంధీ మాటలకు… కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా రేపు ఉదయం అరికపూడి ఇంటికి వెళ్లి ఇంటిపై బి ఆర్ ఎస్ జెండా ఎగురవేసి అతనికి పార్టీ కండువా కప్పి కేసీఆర్ దగ్గరికి తీసుకెళుతానని మాట్లాడటం జరిగిందన్నారు. అరెస్ట్ ఆయున వారిలో పెంట రాజేష్, బొడ్డు రవీందర్.నూతి తిరుపతి.జక్కుల తిరుపతి, కృష్ణవేణి.గాదం విజయ.గుంపుల లక్ష్మి.సంద్యారెడ్డి.స్వప్న.తిరుమల.లింగాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్.ప్రశాంత్.శ్రావణ్.బొబ్బిలి సతీష్.లు ఉన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM