కలెక్షన్ కు అడ్డగా మారిన సాలురా చెక్ పోస్ట్
ముడుపులు ఇవ్వనిదే వాహనాలు వదలరు
సాలు ర..
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలురా చెక్పోస్టు కలెక్షన్ కు అడ్డాగా మారిందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు, ముడుపులు ఇవ్వనిదే అక్కడున్న వారు వాహనాలు వదలడం లేదని పలువురు మండిపడుతున్నారు. చెక్ పోస్ట్ లో ఉన్నత అధికారులు ఎప్పుడు వస్తారో ఎక్కడికి పోతారో ఎవరికి తెలియదని అస్సలు ఉండబోరని, ఏమైనా అడిగితే విసిటింగ్ ఉన్నాయని టూర్స్ ఉన్నాయ్ అనే పేరుతో తప్పించుకొని తిరుగుతారని, ఇక కింది స్థాయిలో ఉన్నవారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి…
, గత కొద్ది రోజుల క్రితం ఏసీబీ దాడి జరగగా సుమారు పదివేల వరకు రూపాయలు ఓ ప్రైవేటు వ్యక్తి దగ్గర దొరికిందని ఆయనపై ఇప్పటికి ఎలాంటి యాక్షన్ లేదని ఆయనకు తొలగించకపోగా మళ్లీ ఆయననే కంటిన్యూ అవుతున్నాడని, అలాంటి వ్యక్తి కంటిన్యూ అయితే మళ్లీ అక్రమం జరగదా, డ్యూటీ పేరుతో ఆ ప్రైవేటు వ్యక్తి వసూళ్ల పర్వం ఇంకా జోరుగా కొనసాగిస్తున్నారు అనేది విమర్శలు లేకపోలేదు, చెక్పోస్టులో ఉన్నత అధికారులు ఎవరు ఉండడం లేదని కేవలం ఒక ఆపరేటరు ఒక ప్రైవేటు వ్యక్తి ఒక అధికారి ముగ్గురు మాత్రమే ఉంటున్నారని వీరు ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని విమర్శలు లేకపోలేదు, ప్రతి వాహనం నుంచి ఏదో ఒక సాకుతో 200 నుంచి ₹1000 వరకు ఆపై డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, రైతులు కూరగాయలు తీసుకుపోతుంటే కూడా కూరగాయలను సైతం తీసుకొని ఇబ్బందులు పాలు చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, వాహనపుదారులకు అర్హౌస్మెంట్ చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, టాక్సీ లలో పరిమితికి మించి వెళ్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని,, నిబంధనలకు తుంగలో తొక్కి డబ్బులు తీసుకుంటూ వదిలిపెడుతున్నారని విమర్శలు లేకపోలేదు, అంతేకాకుండా ఓవర్ లోడ్ తో వెళ్తుంటే కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా భారీగా డబ్బులు తీసుకుంటూ వదిలిపెడుతున్నారని విమర్శలు లేకపోలేదు, ఈ మధ్యకాలంలో కామారెడ్డి జిల్లాలో ఓ చెక్పోస్టు వద్ద .వాహనం వద్ద డబ్బులు తీసుకొని కూడా అరాస్మెంట్ చేస్తున్నారని సదరు డ్రైవర్తో పాటు కొంతమంది ధర్నా చేసిన విషయం, ఈ విషయం రాద్ధాంతం కాకుండా ఆయనకు మేనేజ్ చేసిన విషయం సంచలనం రేపింది, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుకు చెక్పోస్ట్ అయిన సాలురా చెక్పోస్ట్ వద్ద నంబర్ ప్లేట్ లేకుండా అనేక వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా పోతున్నప్పటికీ ఎలాంటి చర్య లేకుండా డబ్బులు తీసుకుంటూ వదిలిపెడుతున్నారని దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి, ప్రైవేటు వ్యక్తులకు సాలుర చెక్పోస్ట్ అడ్డగా మారిందని వసూళ్ల పర్వానికి అడ్డగా మారిందని వీరు వసూలు చేసిన దాంట్లో ఉన్నత అధికారులకు కూడా వాటాలు ఉన్నాయని అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి, ఇంత జరుగుతున్న దీనిపై ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి, ఇప్పటికైనా సాలురా చెక్ పోస్ట్పై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని ప్రజలు వాహనపుదారులు కోరుతున్నారు వసూళ్ల పర్వానికి బ్రేక్ వేయాలని వాహనపుదారుల అరెస్టు ఆపాలని ప్రజలు కోరుతున్నారు. చెక్ పోస్ట్లు రెగ్యులర్ అధికారులు ఉన్నత అధికారుల జాడ కనుమరుగైందని వారు కూడా రెగ్యులర్ గా ఉండేటట్టు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....