రామగుండం నగరాన్ని మోడల్ సిటీ గా తీర్చి దిద్దుతాం
ఐ టి పరిశ్రమల శాఖా మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,,రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఆగస్టు 22:-
రామగుండం నగరాన్ని మోడల్ సిటీ గా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఐ టి , పరిశ్రమల శాఖా మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు . టి యు ఎఫ్ ఐ డి సి నిధులు రూ 29. 5 కోట్లతో లక్ష్మీ నగర్ , కళ్యాణ్ నగర్ , మేదరి బస్తీ , ఉల్లి గడ్డల బజార్ తదితర ప్రాంతాల్లో రోడ్లు , భూ గర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ , వీధి దీపాలు ఏర్పాటు చేసే అభివృద్ది పనులకు బుధవారం గోదావరి ఖని కళ్యాణ్ నగర చౌరస్తాలో ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ది , కనీస వసతుల కల్పన , నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా స్థానిక ఎం ఎల్ ఎ . ఎం ఎస్ రాజ్ ఠాకూర్ ప్రణాళికా బద్దంగా కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్య వ్యాపార కూడలి లక్ష్మీ నగర్ వ్యాపారస్థులకు భద్రత , భరోసా కల్పించడంలో సహకరిస్తున్నామని అన్నారు.. ఇంజనీర్లు, కాoట్రాక్టర్లు అభివృద్ది పనులను ఆషామాషీగా తీసుకోకుండా ప్రజలకు , వ్యాపారులకు ఇబ్బంది కలగని రీతిలో నిర్వహించాలని అన్నారు. గజిబిజీ గా ఉన్న విద్యుత్ తీగలను క్రమబద్దీకరిoచాలని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ లక్ష్మీ నగర్ లో ఏర్పాటు చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో భాగంగా సింగపూర్ కు చెందిన ఒక ప్రవేటు సంస్థ సహకారంతో స్థానికంగా రూరల్ టెక్నాలజీ సెంటర్ నెలకొల్పనున్నామని వెల్లడించారు . రామగుండంలోని పాత 63 మెగా వాట్ల పవర్ ప్లాంట్ స్థానంలో కొత్తగా 800 మెగా వాట్ల సామర్ధ్యంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని అన్నారు. రామగుండం నగరానికి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మంజూరు చేయించేందుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ కృషి చేస్తున్నారని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ స్థానిక ఎం ఎల్ ఎ రాజ్ ఠాకూర్ ప్రభుత్వ పెద్దలతో ప్రేమతో పోరాడి అభివృద్దికి కావలసిన నిధులు మంజూరు చేయించుకుంటున్నారని అన్నారు. రామగుండం అభివృద్ది బాట పట్టిందని త్వరలో నగర ముఖచిత్రం మారిపోనుందని అన్నారు. చేపట్టిన పనులు అధికారులు వేగంగా పూర్తి చేస్తే తాము మరిన్ని నిధులు తీసుకువస్తామని అన్నారు. రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు లక్ష్మీ నగర్ అభివృద్దికి పోరాటం చేశామని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపడతామని హమీ ఇచ్చామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. టి యు ఎఫ్ ఐ డి సి నిధులు రూ 100 కోట్లు మంజూరు కాగా సుమారు 36 కోట్లు నాలుగు డివిజన్ లలో విస్తరించి ఉన్న ముఖ్య వ్యాపార కూడలి లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్ , మేదరి బస్తీ , ఉల్లి గడ్డల బజార్ అభివృద్దికే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం నగర అభివృద్దికి ఎల్ల వేళలా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాను స్మార్ట్ జిల్లా గా తీర్చి దిద్దడానికి మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. రామగుండం నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చే క్రమంలో రూ 2.5 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు , 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ , రూ 100 కోట్లతో సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ , క్రీడా మైదానాలు , శ్మశాన వాటికల అభివృద్ది తదితర పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. అంతర్గాo , పాల కుర్తిలలో ప్రతిపాదించిన అన్ని పనులు పూర్తి చేసి రామగుండం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మినిమమ్ వేజ్ బోర్డు ఛైర్మన్ జనక్ ప్రసాద్ , పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ , కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్ , గణముక్కుల మహాలక్ష్మి తిరుపతి , పొన్నం విద్యా లక్ష్మణ్ , దుబాసీ లలితా మల్లేష్ , ధరణి స్వరూప జలపతి, మహంకాళి స్వామి, బొంతల రాజేష్ , అడ్డాల స్వరూపా రామస్వామి , ముస్తఫా , నాయకులు పాతపెల్లి ఎల్లయ్య , సలీం , పెద్దేల్లి ప్రకాష్ , నగర పాలక సంస్థ సెక్రెటరీ రాజు , ఇ ఇ రామన్ , డి ఇ ఇ జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM