Post Views: 100
-మాజీ జెడ్పిటిసి నార్ల రత్నకుమార్
V 1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:కాంగ్రెస్ పార్టీలోకి బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నామని బాన్సువాడ మాజీ జెడ్పిటిసి నార్ల రత్నకుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం రోజు బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రావడం వలన బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, గంగాధర్, అప్రోజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








