V1News Telangana

best news portal development company in india

కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలో గల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం రోజు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేలు వేతనం చెల్లించాలన్నారు. అలాగే పనికి గుర్తింపు కార్డు, గ్యాస్ పై సబ్సిడీ, ధరించడానికి కాటన్ బట్టల యూనిఫామ్స్, ప్రమాద భీమా, పిఎఫ్, ఈఎస్సీ సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఎలాంటి షరతులు విధించకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india