V1News Telangana

నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి పంటల సాగుకు నీటిని వదిలిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

-రైతులు అకాల వర్షాల దృష్ట్యా ముందస్తుగా వరి నాట్లు వేసుకోవాలి

-సాగునీటి రెవెన్యూ పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేయాలి

-చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి

-నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

-ప్రభుత్వానికి, అధికారులకు రైతులు సహకరించాలి

V1 న్యూస్ నిజాంసాగర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: వర్షాకాలం సీజన్ ప్రారంభమై రైతులు వరి నార్లు పోసుకొని నాటు వేయడానికి నీటి కోసం ఎదురుచూపులు చూస్తున్న తరుణంలో రైతులకు తీపి కబురు చెబుతూ..నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ ద్వారా వర్షాకాలం పంటల సాగుకు ఆదివారం రోజు బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావ్ నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1932 లో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు.మొత్తం 2.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేదని.. కానీ ప్రాజెక్టు లోకి సరిగ్గా నీళ్ళు రాకపోవడంతో ఆయకట్టు తగ్గిపోయిందని అన్నారు.ప్రస్తుతం అలీసాగర్ వరకు ఉన్న 1.30 లక్షల ఎకరాలు నిజాంసాగర్ పరిధిలో ఉన్నది అన్నారు. మొత్తం పది మండలాల పరిధిలో సాగు చేస్తున్నారు అని తెలిపారు.
రాష్ట్రంలోనే మొదటగా ఈ ప్రాంతంలోని రైతులు రోహిణి కార్తె లోనే నార్లు పోసి త్వరగా నాట్లు వేస్తారు అని అన్నారు.
గత ఏడాది విధంగానే ఈ సంవత్సరం కూడా జూన్ నెలలోనే నీళ్ళు విడుదల చేయాలని రైతులు కోరారు అని తెలిపారు.
రైతుల కోరికను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.రైతుల కోరిక మేరకు సాగునీటి శాఖ అధికారులను సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనుమతితో వానాకాలం పంటల సాగుకు ఈరోజు నీటిని విడుదల చేసాం అని తెలిపారు.నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.6 TMC లు కాగా..ప్రాజెక్టులో ప్రస్తుతం 4.3 TMC ల నీరు నిల్వ ఉన్నదని తెలిపారు. ఇందులో డెడ్ స్టోరేజ్ పోను 3.6 TMC ల నీటిని పంటల సాగుకు వినియోగించుకోవచ్చని తెలిపారు.ఒకవేళ సమయానికి వర్షాలు కురవక ప్రాజెక్టు లోకి నీళ్ళు రాని యెడల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి 2 TMC ల నీరు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు.నీటిని విడతల వారిగా విడుదల చేస్తాం అన్నారు.మొదటి విడతలో భాగంగా ఈరోజు నుండి 1400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం అని తెలిపారు. మొదటి విడతలో రైతులు వరి నాట్లు వేసుకుంటారు కనుక 15 రోజుల పాటు పంటల సాగుకు నీటి విడుదల జరుగుతుందనితెలియజేశారు.తర్వాత ఒక్కో విడతలో పది రోజుల చొప్పున నీటి విడుదల జరుగుతుందని తెలిపారు..వర్షాకాలం కాబట్టి వానలు కురవడం వలన రైతులకు కొంత మేలు జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో ఆయన సాగునీటి, రెవిన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేసి అన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీళ్ళు సక్రమంగా చివరి ఆయకట్టు వరకు అందే విధంగా విదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులు నీటిని వృదా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. రైతులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రాజెక్టు లలో నీళ్ళు లేని కారణంగా రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు నుండి కూడా ఆయకట్టుకు సాగునీరు ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు నీరు విడుదల చేయలేదు అని తెలియజేశారు.
కేవలం నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి మాత్రమే నీటి విడుదల జరిగిందన్నారు.గత ఏడాది యాసంగిలో నీటి విడుదల క్రమబద్ధీకరణ చేసి పొదుపుగా వాడడంతో ప్రస్తుత వానాకాలం సాగుకు నీళ్ళు మిగిలాయని తెలిపారు.నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదలకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లకు రైతుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దఫెదార్ శోభ, మాజీ జెడ్పిటిసి ప్రదీప్ పటేల్, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?