V1News Telangana

ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు….

V1న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం రోజు స్థానిక జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ఎంపీపీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డి లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కళాశాలలో విద్యార్థులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతమంది అడ్మిషన్లు తీసుకున్నారన్న విషయంపై అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 42 మంది విద్యార్థులు అడ్మిషన్ అయ్యారని ఉపాధ్యాయులు వారికి తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం వలన మండలంలోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?