Post Views: 44
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం పనులను బుధవారం రోజు పంచాయతీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పారిశుద్ధ్య పనులను ఎంపీ ఓ రాము సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని కూలీలకు సూచించారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తా,చెదారం మరియు గుంపులుగా పెరిగిన చెట్లు అన్నింటిని తొలగించి గ్రామాన్ని శుభ్రం చేయడంలో సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, కారొబారి రతన్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..