Post Views: 94
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునః ప్రారంభమైన మొదటి రోజు ఎంపీపీ పాల్త్య విట్టల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వలన ఎటువంటి ఫీజులు చెల్లించకుండా విద్య, దుస్తులు, మధ్యాహ్న భోజన సౌకర్యం, పుస్తకాలు వంటి అనేక సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు హరి, ఉపాధ్యాయులు ఐశ్వర్య, మౌనిక, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








