Post Views: 49
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రంలో ఆయమ్మగా విధులు నిర్వహించిన గ్రామానికి చెందిన జింక గంగమణి (56) అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయమ్మ అందించిన సేవలకు గాను ఆమె దహన సంస్కారాలకు డిపార్ట్మెంట్ నుండిరూ.10 వేలు ఆమె కూతురు స్వప్నకు సిడిపిఓ కళావతి, సూపర్వైజర్ వాణి, గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్, అంగన్వాడి టీచర్ సరోజిని సమక్షంలో ఆర్థిక సహాయం అందించారు. గంగమణి ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరుకున్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..