Post Views: 39
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు నీటి సరఫరా సర్వేలో డి .ఎల్. పి .ఓ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటింటికి మంచినీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరమ్మత్తులు ఉన్న ప్రదేశాలను గుర్తించి పరిష్కార మార్గాలను సత్వరంగా నిర్వహించాలని తెలిపారు. పైపు లీకేజీలను గుర్తించి వెంటనే సిబ్బందితో పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.ఓ రాము, గ్రామపంచాయతీ కార్యదర్శి సవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..