కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని
సంగం గ్రామం లో మంగళవారం రోజు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి పలు వ్యాధుల కు, చికిత్స లు చేసి మందులు పంపిణి చేశారు.మరియు వైద్య బృందం గ్రామంలో గృహ సందర్శనలు చేసి ప్రజలకు ఆరోగ్య సలహాలు తెలిపారు. వర్షాకాలం సమీపించడం వలన ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం వలన అధిక దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యాల పాలు అవుతారని సూచించారు.
గ్రామం లో గల మురికి కాల్వలు శుభ్రంగా చేయించమని..మరియు వాటర్ ట్యాంక్ లను శుభ్రం చేసి, క్లోరైనేషన్ చేయించాల్సిందిగా గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలిపారు.ఈ కార్యక్రమం లొ dr. గిరీష్ , cho. రవీందర్ మరియు వైద్య సిబ్బంది , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..