V1News Telangana

నత్త నడకన సాగుతున్న” అమ్మ ఆదర్శ పాఠశాల” అభివృద్ధి పనులు….

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “‘అమ్మ ఆదర్శ పాఠశాల'”అనే పేరుతో పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రం లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి, ప్రభుత్వం కొన్నిరోజుల క్రితం నిధులను విడుదల చేసింది… ఈ క్రమంలో నసురుల్లాబాద్ మండల వ్యాప్తంగా ప్రభుత్వ నిధులతో ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి…. ఈ క్రమంలో దుర్కి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించగా ఇప్పటికీ పనులు పూర్తికాని విషయం వెలుగులోకి వచ్చింది.కొన్ని చోట్ల ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు మొదలు కాలేదు, వేసవి సెలవులు ముగించుకొని మరో రెండు రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కాబోతున్నాయి, ఆ గడువు లోపు పూర్తి కావాల్సిన పనులు ఇప్పటివరకు చాలా చోట్ల మొదలుకాలేదు… ప్రభుత్వం విడుదల చేసిన అర కొర నిధులతో పనులు అసంపూర్తిగా మధ్యలోనే ఉన్నాయి… ఈ నిధుల పైన ప్రభుత్వ అధికారుల యొక్క పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే ఉంది… నిరుపేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనలో భాగంగా ముఖ్యంగా ఆడపిల్లల కోసం టాయిలెట్స్ ను నిర్మించవలసిందిగా తెలుగునాడు విద్యార్థి సంఘం యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్ తెలిపారు. పాఠశాలల్లో ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేసి మౌలిక వసతులను కల్పించవలసిందిగా ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు .

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?