బోధన్ డివిజన్ లోని విలేకరులకు ప్లాట్లు ఇచ్చారు ఓకే
నిజాంబాద్ డివిజన్లోని విలేకరులకు బోధన్ లో ప్లాట్లు ఇవ్వడం ఏమిటి
కొంతమంది మాజీ లీడర్లు కూడా ప్లాట్లు ఇవ్వడం వెనుక అంతర్యం ఏమిట
బోధన్ మండల కేంద్రంలో నియోజకవర్గంలో ఉన్న ఎంతోమంది విలేకరులకు ప్లాట్లు రాక ఇబ్బందులు
ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ పొందారు ప్రభుత్వ ప్లాట్లు పొందారు మళ్ళీ బోధన్ పెగడపల్లి లో కూడా ప్లాట్లు పొంది ఇల్లు కడుతున్నారు, డబుల్ బెడ్ రూమ్ కోసం తహతలాడి సంపాదిస్తున్నారు, నిరుపేదల పరిస్థితి ఏంది నిరుపేద విలేకరుల పరిస్థితి ఏమిటి…
డబుల్ డబుల్ బెడ్ రూమ్ పొందుతూ ఇళ్ల స్థలాలు పొందుతూ బోధన్ డివిజన్లో తామే సర్వం విలేకరులు తామే పెద్దలు అంటూ చెలాయిస్తున్న పెద్ద విలేకరులు
పెద్ద విలేకరుల ముసుగులో స్వార్థం
అంతా సర్వం మేమే అంటూ లీడర్లు, పాలకులు, అధికారుల వద్ద గరీబ్ విలేకరులు చిన్న పత్రిక విలేకరులు యూట్యూబ్ విలేకరులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు.
ఏళ్ల నుంచి చిన్న పత్రిక యూట్యూబ్ విలేకరులు గరీబ్ విలేకరుల పరిస్థితి ఆగమ గోచారం..
బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం , అప్పటి ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఉన్నప్పుడు సుమారు 70 నుంచి 80 మంది విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, అర్హులైన విలేకరులకు ఇస్తే ఓకే ,బోధన్ నియోజకవర్గంలోని బోధన్ డివిజన్ విలేకరులకు ఇస్తే ఓకే, కాగా బోధన్ డివిజన్ కాకుండా బోధన్ నియోజకవర్గం కాకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రం చెందిన వారు నిజాంబాద్ జిల్లాలోని ఇతర గ్రామాల్లో ఉన్న విలేకరులకు ఇక్కడ ప్లాట్లు ఇవ్వడం ఏమిటి వారు ఇల్లు కట్టుకోవడం ఏమిటి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం ఏమిటి అనే ప్రశ్నలు సర్వత వినిపిస్తున్నాయి, నిజాంబాద్ డివిజన్లో ఉన్నవారికి ఇక్కడ డబుల్ బెడ్ రూమ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల బోధన్ నియోజకవర్గంలో బోధన్ డివిజన్ ఉన్న ఎంతోమంది విలేకరులకు ఇళ్ల స్థలం లేక ఇళ్లస్థలాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నారనే ప్రశ్నలు సర్వోత వినిపిస్తున్నాయి. కొంతమంది పెద్ద విలేకరి ముసుగులో స్వార్థం ఉందని వారు మండల స్థాయిలో ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందడం జరిగిందని, ఇళ్ల స్థలాలు పొందడం జరిగిందని అదేవిధంగా మళ్ళీ అదే ముసుగులో బోధన్ పెగడపల్లి శివారులో కూడా ప్రభుత్వ ఇళ్ల స్థలం పొంది డబుల్ బెడ్ రూమ్ కూడా పొందుతున్నారని అది కూడా ఇతర ఇతర పేర్లపై పొందుతున్నారని ఇదెక్కడి న్యాయమని దీంతో ఎంతోమంది గరీబ్ విలేఖరులు లాస్ అవుతున్నారని ఆరోపణలు సర్వోత వినిపిస్తున్నాయి. పెద్ద విలేఖరి ముసుగులో స్వార్థం ఆలోచిస్తూ, వారు స్వార్థం ఆలోచించడంతోపాటు వారి సమూహంలో ఉన్న వారి స్వార్థం ఆలోచించడమే కాకుండా గరీబ్ విలేకర్ల పరిస్థితి పై డేగ కన్ను వేస్తూ టార్చర్ పెడుతూ వారిని ఇబ్బంది పాలు చేస్తున్నాననే విమర్శలు లేకపోలేదు, పాలకులు అధికారుల వద్ద తామే పెద్ద విలేకరులు అంటూ స్వార్ధం ఆలోచిస్తున్నా పరిస్థితులు నెలకొంటున్నాయి తప్ప గరీబ్ విలేకరుల పరిస్థితి గురించి ఆలోచించడం లేదని గరీబ్ విలేకరులకు తొక్కుడు కార్యక్రమమే చేసినారు తప్ప వారి గురించి ఆలోచించే నాధులు కరవయ్యారనే విమర్శలు లేకపోలేదు. బోధన్ డివిజన్ తో పాటు బోధన్ నియోజకవర్గానికి చెందిన ఎంతో మంది విలేకరులు గరీబ్ విలేకరులు యూట్యూబ్ విలేకరులు చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలం రాక అవస్థలు ఎదుర్కొంటున్నారు చెప్పులు అరిగేలా తిరుగుతూ తమకు డబ్బులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ అధికారులు ,పాలకులు వద్ద తిరుగుతున్న ఫలితం లేదని విమర్శలు ఉన్నాయి. కొంతమంది మాజీ పాలకులకు విలేకరుల డబుల్ బెడ్ రూమ్ వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వడం వెనక అంతరం ఏమిటని పలువురు ప్రశ్నించుకుంటున్నారు, బోధన్ పట్టణ కేంద్రంతోపాటు నియోజకవర్గం లో ఎంతో మతికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థలాలు లేక కిరాయి ఇంట్లో ఉంటూ ఇబ్బంది పెడుతున్నారని అలాంటి వారి పరిస్థితి ఆగమగోచరంగా మారిందని, కొంతమంది కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారికి డబుల్ బెడ్ రూమ్ ఎలా ఇస్తారు అదేవిధంగా స్థానికులు కానప్పటికీ అదేవిధంగా ఆధార్ కార్డు లేనప్పటికీ వారికి డబుల్ బెడ్రూం బిల్లులు ఎలా ఇస్తారు అనే ప్రశ్నలు సర్వత్ర వినిపిస్తున్నాయి. లోతుగా వెళ్తే అనేక లోపాలు ఉన్నాయని అలాంటి వారికి ఇచ్చి నిరుపేదలైన నిరుపేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శలు లేకపోలేదు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....