Post Views: 51
బోధన్ పట్టణంలో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్ర పోలీసు బలగాల కవాతు నిర్వహించారు. ఎన్నికల కమీషన్, సీపీ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం బోధన్ పట్టణ శివారు నుండి ఆచన్ పల్లి, శక్కర్ నగర్ లోని పలు సమస్యాత్మాక ప్రాంతాల గూండా కవాతు నిర్వహించినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వీరయ్య, కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు ఉన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....