Post Views: 68
బీర్కూర్ మండలం: మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన నీరడి శ్రీను అనే వ్యక్తి మాజీ శాసనసభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితుడై సోమవారం రోజు ఎంపీపీ తిలకేశ్వరి రఘు ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరాడు. బాన్సువాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశానుసారం నీరడి శ్రీనును బైరాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎంపీటీసీ సందీప్ పటేల్, బీర్కూర్ పట్టణ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు దుంపల రాజు, సీనియర్ నాయకులు అమ్మవారి గంగారం, ప్రధాన కార్యదర్శి కొరిమె రఘు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








