రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓటేయాలని,బిఆర్ఎస్ పార్టీ మైనార్టీల ఓట్లు చిల్చే ప్రయత్నాలు చేస్తుందని సులేమాన్ నగర్ ఎంపీటీసీ గౌస్ తెలిపారు.రానున్న రోజుల్లో దేశ భవిషత్తు ఓటర్ల చేతులో ఉందని మతాల పేరిట రెచ్చ గొట్టి గోడవలు చేయించే పార్టీ లను ఎన్నుకోంటారు, ప్రజలకు ఉజ్వలమైన భవిషత్తు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారో ఆలోచన చేయాలనీ అయన తెలిపారు.జహిరాబాద్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ శెట్కార్ గారికి మీ అమూల్యమైన ఓటుని కేటాయించి వారికి విజయం కల్పించే దిశగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ సహకరించాలని ఎంపిటిసి గౌస్ కోరారు. గతంలో జహీరాబాద్ నుండి రెండు సార్లు ఎంపీ గా గెలుపొందిన బీబీ పాటిల్ రాష్ట్రంలో అధికారం పొంగనే జంపు జిలాని అనే విధంగా పార్టీ మార్చేశారని, పాటి మారినంత మాత్రాన వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని రెండు సార్లు ఎంపీ గా గెలిచిన కనీసం బాన్సువాడ నియోజకవర్గానికి ఆయన అడుగు పెట్టలేదని అలాంటి నాయకుడు ఇంకోసారి ఎంపీగా ఉండడం ప్రజలు ఒప్పుకోరని, బిఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలు లేనప్పటికీ కాంగ్రెస్ లోని ఓట్లను చీల్చి బిజెపికి గెలుపు దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుందని ప్రజలు గ్రహించాలని సులేమాన్ నగర్ ఎంపిటిసి గౌస్ తెలిపారు.

Author: IRFAN Reporter
Work from as a journalist