V1News Telangana

నన్ను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేను భావోద్వేగంతో పోచారం.*

*పెండింగులో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇయ్యకపోతే అమరణ నిరాహారదీక్ష చేస్తాను. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను. పోచారం

*నన్ను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేను భావోద్వేగంతో పోచారం.*
రుద్రూర్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాలలో ఈరోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో జహీరాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ తో కలిసి మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రసంగించడం జరిగింది.

పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ డి సి సి బి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి గారు, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.

*ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.

టిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే మంజూరు అయ్యాయి అని అన్నారు.

అందులో 10,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించుకున్న పేద లబ్ధిదారులకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించాను అని అన్నారు.

ప్రభుత్వం మారిన తరువాత పెండింగ్ లో ఉన్న రూ. 26 కోట్ల బిల్లులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మంత్రిని కోరితే ఆయన అంగీకరించారు. తరువాత ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ మంత్రి దగ్గరకు వెళ్ళి బిల్లులు ఇవ్వొద్దని చెప్పారట అని తెలిపారు

టిఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించాను. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 30 కోట్ల బిల్లులను ఇవ్వడం లేదు అని తెలిపారు.

నన్ను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేను అని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల లోపు బిల్లులు రాకపోతే మే 13 ఓటింగ్ తరువాత లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాను అని పేర్కొన్నారు.

అయినా ప్రభుత్వం స్పందించక బిల్లులు ఇయ్యకపోతే అమరణ నిరాహారదీక్ష చేస్తాను, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను. పేదల కోసం నాకు ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదు అని అన్నారు..

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఆశపడి ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు అని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదు అని తెలిపారు.

రైతుబంధు ఎకరాకు రూ. 15,000,
కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు అని అన్నారు.

అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు.

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో ఆడబిడ్డకు లక్షా పదహారు వేల రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఒక్కరికీ కూడా ఇవ్వకుండా నా అక్కా చెల్లెలను మోసం చేస్తున్నారు.

డిసెంబర్ 9న ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తాను, రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. రైతులను మోసం చేశారు.

200 యూనిట్ల వరకు కరంటు ఫ్రీ అన్నారు, లేదు. రూ. 500 కు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. ఎక్కడా లేదు.

ఇందులో ఏది కూడా అమలు చేయడం లేదు. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటు తో బుద్ది చెప్పాలి.

బాన్సువాడ నియోజకవర్గంలో గత పదేళ్ళలో ప్రజలు అడిగిన, కోరిన పనులన్ని చేశాను.

గతంలో నిజాంసాగర్ కాలువ ఆయకట్టులో చివరి ఆయకట్టుకు సరిగ్గా నీరందేది కాదు. BRS ప్రభుత్వంలో కాలువలకు లైనింగ్ చేయించాను.

గత పది సంవత్సరాలలో గుంట పంట కూడా ఎండిపోకుండా మంచిగా పంటలు పండించుకున్నాం.

మోడీ అబద్ధాలు చెప్పడం తప్ప, ప్రజలకు చేసింది ఏమీ లేదు.

బిజెపి పార్టీ అభ్యర్థి బిబి పాటిల్ గత పదేళ్ళు ఎంపీ గా ఉండి ఏనాడు గ్రామాలకు వచ్చి ప్రజలకు సేవ చేయలేదు.

బలహీన వర్గాల బిడ్డ అనీల్ కుమార్ ను మనమందరం కష్టపడి గెలిపించి పార్లమెంట్ కు పంపించాలి.

అందరం కారు గుర్తుపై ఓటు వేసి BRS పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ గ మాట్లాడుతూ.

అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేస్తాను అని అన్నారు.

మీ గొంతై ప్రజా సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తా అని తెలిపారు.

ఇంతకు ముందు 10 సంవత్సరాలు MP ఉన్న వ్యక్తి, అంతకు , 5 ఏళ్ళు ఉన్నవారు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు అని అన్నారు.

ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమలు రావలి అన్నారు.

నూతన రైల్వే ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా అని తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?