V1News Telangana

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలు…..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో భారత్ గార్డెన్ ప్రక్కన కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ సన్నాహక విస్తృత స్థాయి సమావేశం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ కార్యకర్తలే నాయకులకు ఆధారమని కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉద్భవించలేరని , వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒకే కుటుంబం రాచరిక పాలన వల్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, సుమారు 7 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని దివాలా తీసారన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్లాలన్నారు. సమాజం స్వేచ్ఛను కోరుకుంటుందని రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు మన అందరిపై ఉందన్నారు. ప్రజలకు ప్రశ్నించే తత్వం ఉండాలని, ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందన్నారు. ఎన్నికల తర్వాత బాన్సువాడ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అందరూ సమన్వయంతో పనిచేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్ కార్ ను గెలిపించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ కమిటీలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా నిజమైన అర్హులకు ఇల్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిర్ణయించే అధికారం ఉంటుందన్నారు .రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని ఆయన హయాంలో ఆరోగ్య శ్రీ పథకం 108 విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.ఈ సందర్భంగా మంత్రిని నాయకులు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ కెసిఆర్, కేటీఆర్, మతిస్థిమితం లేని అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు పొరపాటున బి.ఆర్.ఎస్ పార్టీకి ఓటేస్తే బిజెపికి ఓటేసినట్టే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతాప్ సింగ్ మాజీ జెడ్పిటిసి కొత్తకొండ భాస్కర్ నార్ల రత్నకుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా పాత బాలకృష్ణ నాయకులు శ్రీనివాసరావు పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి మండల అధ్యక్షుడు మంత్రి గణేష్ , నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి , కార్యదర్శి శివప్రసాద్ , మైనారిటీ విభాగం మండల అధ్యక్షుడు యూసుఫ్, నసురుల్లాబాద్ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు, మంతపురి సాయ గౌడ్, నస్రుల్లాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినాల లింగం, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?