V1News Telangana

best news portal development company in india

పదవ తరగతి విద్యార్థిని అదృశ్యం

SHARE:

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని అదృశ్యమైంది.విద్యార్థిని తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె బీర్కూర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది.శుక్రవారం నాడు పదవ తరగతి చివరి పరీక్షకు హాజరై తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్ల గాలించి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని అదే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india