V1News Telangana

భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

భార్యను గొంతు కోసి హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ బోధన్లోని ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి జడ్జి ఎస్. రవి కుమార్ తీర్పు వెలువరించారు.

కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన చికెన్ వ్యాపారి పిల్లోల్ల దేవోజీకి మెదక్ జిల్లా నల్లవాగు గ్రామానికి చెందిన మనూబాయికి వివాహమైంది. కొన్నాళ్లు బాగానే ఉన్నా మనస్పర్ధలతో గొడవలయ్యాయి, మొదటి కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన మనూభాయి అక్కడే భర్తపై కేసు నమోదు చేసింది. కేసు నడుస్తుండగా దేవోజీ విజయను రెండో వివాహం చేసుకున్నాడు. కేసు నడుస్తుండగా మనూబాయి, దేవోజీ మళ్లీ కలిసిపోయారు. ఆమె తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. అంతా కలిసి జీవిస్తున్న సమయంలో మళ్లీ గర్భం దాల్చిన ఆమె రెండో కొడుకుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవడంతో మరోసారి పుట్టింటికి వెళ్లిపోయిన మనూబాయి భర్తపై కేసు నమోదు చేసింది. మధ్యవర్తుల ద్వారా మళ్లీ రాజీపడి భర్త దగ్గరకు వచ్చింది. ఈ విషయంలో భార్యపై కోపం పెంచుకున్న దేవోజీ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చికెన్ కొట్టే కత్తితో 2021 మే 3న భార్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయి నేరం అంగీకరించాడు. ఈ మేరకు అప్పటి సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మురళి కేసు నమోదు చేసి సరైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యాంరావు వాదనలు వినిపించారు. ఈ మేరకు సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి నిందితుడికి జీవితఖైదు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించారు. లైజనింగ్ అధికారి శంకర్ ఈ మేరకు వివరాలు తెలిపారు అదేవిధంగా కోర్టు పోలీసు సిబ్బంది రాములు మనోహర్, ఇన్స్పెక్టర్ కోల నరేష్, సబ్ ఇన్స్పెక్టర్ సాయన్న కేసుకు సహకరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?