V1News Telangana

జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడ శాసనసభ BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశం

మార్చి 26, 2024
బాన్సువాడ నియోజకవర్గం.

*నా రాజకీయ వారసుడు పోచారం భాస్కర్ రెడ్డి*

*BRS పార్టీ అధ్యక్షుడు శ్రీ కేసీఆర్ గారి సూచనతో పోచారం భాస్కర్ రెడ్డి గారిని BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ గా నియమిస్తున్నాను.*

*పోచారం..*

జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి BRS పార్టీ విసృత స్థాయి సమావేశం ఈరోజు బాన్సువాడ పట్టణ శివారు, కొల్లూరు రోడ్డు లోని SMB ఫంక్షన్ హాల్ లో జరిగింది.

మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు‌, BRS పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు, కామారెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు డి అంజిరెడ్డి, మాజీ శాసనసభ్యులు కత్తెర గంగాధర్, బంజారా సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

*ఈసందర్భంగా పోచారం గారు మాట్లాడుతూ…*

విసృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున హాజరైన BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

నా రాజకీయ వారసత్వానికి సంబంధించిన సందిగ్దతకు తెరదించుతూ BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలతో పోచారం భాస్కర్ రెడ్డి గారిని నా
రాజకీయ వారసుడుగా ప్రకటిస్తున్నాను.

అదేవిధంగా పోచారం భాస్కర్ రెడ్డి గారిని BRS పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జీ గా నియమిస్తున్నాను.

మనమందరం కలిసి కట్టుగా కృషి చేసి జహీరాబాద్ BRS పార్టీ MP అభ్యర్థి శ్రీ గాలి అనీల్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.

మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మన తరుపున BRS పార్టీ MP అభ్యర్థి ఢిల్లీలో ఉండాలి.

గతంలో MP లుగా పనిచేసి ఇప్పుడు బిజేపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న బిబి పాటిల్, సురేష్ షేట్కార్ లు ఈ ప్రాంత అభివృద్ధికి ఏ మాత్రం నిధులు తీసుకురాలేదు.

పదేళ్ళు అధికారంలో ఉండి ఏం పని చేశావు బిబి పాటిల్ ను అడుగుతున్నా.

ఢిల్లీలో కూర్చోని స్వంత ఫైరవీలు, వ్యాపారులు చేసుకోవడం తప్ప ఈ ప్రాంత ప్రజలకు అయన ఏ మేలు చేయలేదు. ప్రజల సమస్యలను బాగు చేయడానికి గ్రామాలలో ఏనాడు తిరిగింది లేదు, ప్రజల సమస్యలు తెలుకున్నది లేదు.

బిబి పాటిల్ ఎందుకు ఓట్లు వెయ్యాలి ?.

సురేష్ షెట్కార్ కూడా గతంలో అయిదేళ్ళు MP గా పనిచేశాడు. నువ్వు అప్పుడు ఏం పని చేశావు చెప్పి ఇప్పుడు ఓట్లు అడుగు.

BRS ప్రభుత్వంలో కేసీఆర్ గారి సహాకారంతో పుష్కలంగా నిధులు తీసుకువచ్చి నేను బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను.

ఈరోజు ఓట్లు అడిగే అర్హత నాకు మాత్రమే ఉన్నది.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత మొదలైంది.

దీనిని మనం సానుకూలంగా మలుచుకోవాలి.

కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలను ఇచ్చింది.

రైతుబంధు పథకం మొత్తాన్ని రూ. 10,000 నుండి రూ. 15,000 కు పెంచుతాం అన్నారు, ఇప్పటి వరకు పెంచలేదు సరికదా అసలు మూడు ఎకరాలకు మించి ఇయ్యలేదు.

రుణమాఫీ లేదు, 24 గంటల కరంటు రావడం లేదు.

కౌలు రైతులకు రూ. 15,000 ఆర్ధిక సహాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12,500 లేదు.

క్వింటాలుకు బోనస్ రూ. 500 అమలు చేయలేదు.

నిరుద్యోగ భృతి లేదు, ఇందిరమ్మ ఇల్లు లేవు.

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఇంకా మొదలు పెట్టలేదు.

మహిళలకు రూ. 2500 భృతి అన్నారు, ఇంకా లేదు.

మొత్తం 420 హామీలలో ఏవి అమలు కావడం లేదు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు.

అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం RTC కార్పొరేషన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ట్రాన్స్ కో , గ్యాస్ సిలెండర్ సబ్సిడీని పౌరసరఫరాల కార్పొరేషన్ భరిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన నిధుల నుండి రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు.

110 రోజులైంది ఏ అర్హతతో ఓట్లు అడుగుతారు.

రైతులను కడుపులో పెట్టుకుని కాపాడిన BRS పార్టికి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉన్నది.

రాజకీయాలలో బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి.

పార్లమెంట్ ఎన్నికల తదుపరి రాజకీయాలలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.

మనకు ఇప్పుడు చీకటి రోజులు వచ్చాయి, భవిష్యత్తులో మళ్ళీ మంచి రోజులు వస్తాయి.

ముఖ్యమంత్రి, మంత్రులు శాశ్వతం కాదు, కానీ శాసనసభ్యుడు మాత్రం అయిదేళ్ళు శాశ్వతం.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో పంటలు ఎండిపోతున్నాయి. BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుంట కూడా ఎండిపోలేదు.

పట్టించుకునే నాధుడు లేడు.
కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండిపోలేదు, ఇప్పుడు ఎందుకు ఎండుతున్నాయని రైతులు ఆలోచిస్తున్నారు.

రైతుబంధు డబ్బులు ఠంచనుగా వచ్చేవి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలి.

పాత పద్దతిలో రైతుబంధు ఇవ్వడానికి రూ. 15,000 కోట్లే లేవు. ఇంకా మిగిలినవి ఎలా తెస్తారు.

అధికారంలోకి రావాలనే కోరికతో అలివికాని హామీలు ఇచ్చారు.

అనీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకుందాం.

నేను MLA గా, అనీల్ కుమార్ MP గా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాం.

ఈ ప్రాంతం మీదుగా నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ను తీసుకువచ్చి మన ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చేందే విదంగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం.

కొన్ని సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్లు అవాస్తవ కథనాలు వస్తున్నాయి.

నాకు BRS పార్టీలో గౌరవం ఉన్నది.
పదవులు అనుభవించి పార్టీలు మారే వాడిని కాదు.

నేను BRS పార్టీలోనే ఉంటాను. కేసీఆర్ గారి నాయకత్వం లోనే కొనసాగుతాను.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?