జగిత్యాల జిల్లా: మార్చి 18
పార్లమెంట్ ఎన్నికలు సమీ పిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్ గిరి లో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే.
సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యట నలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలం గాణ పర్యటించిన మోదీ తాజాగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగ మైన తెలంగాణ జగిత్యాల లో జరిగిన బహిరంగ సభకు ఈరోజు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ అటు బీ ఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగా ణలోని కాళేశ్వర ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందనీ, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు ఫిర్యాదు చేయడం ఆరోపించారు.
ఈ రెండు పార్టీలు తనను దూశించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయని మోడీ అన్నారు. తెలంగాణను దోచుకున్నవారిని ఎవరినీ వదలం అంటూ మోడీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
పోలింగ్ రోజు దగ్గరపడు తున్న కొద్దీ తెలంగాణలో బీజేపీ ప్రభంజనం కనిపి స్తోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రక్షాళన అవుతాయని వ్యాఖ్యానించారు.
పొరుగున ఉన్న కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంపై కూడా సోమవారం సమా వేశం ప్రభావం చూపుతుం దని మోదీ భావిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి…..

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....