పగలు పోలీస్ శాఖ మరియు రెవిన్యూ శాఖ అధికాలు అక్రమ రవాణా చేసే ట్రాక్టర్ లను పట్టుకుంటున్నారనే భయం తో రాత్రి సమయం లో పోతంగల్ లోని ఇసుకసురులు దో నెంబర్ దందా దర్జాగా కొసనసాగిస్తునారు. పోతంగల్ గ్రామం లోని వాగు నుండి 10 ట్రాక్టర్ లకు పైగా ఇసుక నింపుకొని అమ్మకాలు జరుపుకుంటున్నారు. మరి రాత్రి సమయం లో నడుస్తున్న ఇసుక మాఫియా ను అరికట్టడం ఎలా ఈ రాత్రి ఇసుక రాయులకు తిరుగు లేదా అన్నట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.సంబంధిత శాఖ పై స్థాయి అధికారులు రాత్రి సమయం లో నడుస్తున్న ఇసుక మాఫియా ను అరికట్టాలంటే పోతంగల్ వాగు వద్ద పెట్రోలింగ్ చేయిస్తే రాత్రి సమయంలో కొనసాగుతున్న ఇసుక మాఫియా అంతమవుతుందని స్థానికులు తెలుపుతున్నారు. రాత్రి సీసీ కెమెరా ల ఎదుట ట్రాక్టర్ లు వెళ్తున్న దృశ్యల ఆధారంగా ఆ ట్రాక్టర్ ల పై కేసులు చేస్తే పూర్తి స్థాయిలో అక్రమ ఇసుక రావణను అరికట్టవచ్చు.

Author: IRFAN Reporter
Work from as a journalist