Post Views: 55
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి :- 17
రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ శనివారం గోదావరి ఖని సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ పనులు పరిశీలించారు.జాతర ఆవరణతో పాటు పరిసరాల్లో పరిశుభ్రత పటిష్టoగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. , చెత్త వేయడం, కాల్చడం వంటివి చేయకుండా కాపలా పెట్టాలని ఆదేశించారు. గద్దెలకు సమీపంలో నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన కియోస్క్ లను కూడా జాతర అవసరార్థం ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సందర్బంగా ఆయన వెంట కార్పొరేటర్లు పాతపెల్లి ఎల్లయ్య,బాలరాజ్ కుమార్,కన్నూరి సతీష్, నాయకులు నీలం గణేష్,సలీం తదితరులు ఉన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM