బడా పహాడ్ లో భక్తుల బడా దోపిడీ
అనేక ఏండ్ల నుంచి కొనసాగుతున్న దోపిడి
సీసీ కెమెరాలు ఉన్న పని చేయని వైనం
ఐదు ధర్మశాల పరిస్థితి అస్తవ్యస్తం భక్తులకు తీరని కష్టాలు…
ఇష్టానుసారంగా హై-ఫై లెవల్లో ఇండ్ల నిర్మాణాలు
గదుల రెంటు 1000 నుంచి 2000 ఆపైన మాత్రమే
గుట్టకు చెందిన 711 ఎకరాలు రెవిన్యూ వ్యవస్థ మాదని, ఫారెస్ట్ వ్యవస్థ మాదని, వక్బోడు వ్యవస్థ మాదని ఒకరికొకరు లొల్లిలా పరంపర, తేలని జాగాల పంచాయతీ
ఎవరి అనుమతు లేకుండానే యాడ జాగా దొరికితే ఆడ హైఫై లెవెల్ లో రూమ్ లో నిర్మాణం భీకరంగా అద్దె వసుల్…
జలాల్పూర్ గ్రామపంచాయతీ నుంచి కూడా అనుమతులు గదులకు లేవు టాక్స్ లు కూడా చెల్లించకపోవడంతో గ్రామపంచాయతీకి అందని ఆదాయం
రామన్న లంక నుంచి జలాల్పూర్ గ్రామ అభివృద్ధి కోసం లక్ష రూపాయలు పంతుల నుంచి సేకరణ
దర్గా నుంచి గ్రామపంచాయతీకి ఎలాంటి ఆదాయం నో
గతంలో ఏర్పాటు చేసిన కమిటీ సంవత్సరం కూడా ఉండక రద్దు కావడం భక్తుల పాలిట శాపం
చిరు వ్యాపారస్తులు ఇతర వ్యాపారస్తుల నుంచి దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్
ఏళ్ల నుంచి అర్ధాంతంగా ఆగిపోయిన వక్బోర్డు కార్యాలయ భవన నిర్మాణ పనులు
కందూర్లు సమర్పించాలన్నా, కొబ్బరికాయ పగలగొట్టాలన్న, కేశఖండనకు, మేకలు కొయ్యడానికి కూడా, భారీగా వసూల్
మెట్ల సౌకర్యాలు కూడా మరమ్మతుల దశకు చేరాయి భక్తుల రాకపోకలకు అంతరాయం,,
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం భక్తుల పాలిట శాపం,,
వర్ని
బడాపహాడ్
నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడా పహాడ్ పెద్దగుట్ట, హజ్రత్ బాబా షాదుల్లా హుసేని రహ దర్గా పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఈ దర్గా దర్శనం కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి తాండూప తండములుగా భక్తులు అధిక సంఖ్యలో దైవ దర్శనం కోసం మొక్కుబడులు తీర్చుకోవడం కోసం వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం శుక్రవారం జాతర ఉత్సవాలు ఈ పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఉంటుంది. ఎంతో మంది భక్తులు కుల మతాలకు అతీతంగా ఈ దైవ దర్శనం కోసం వస్తూ ఉంటారు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఇతర జిల్లా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. భక్తులు తమ తమ మొక్కుబడులు తీర్చుకోవడం కోసం భక్తులు పోటా పోటీ పడుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో కొండపై ఉన్న దర్శనం కోసం మొక్కుబడులు తీర్చడం కోసం కందూర్లు సమర్పిస్తూ ఉంటారు. కందూర్లు సమర్పించడానికి భక్తుల నుంచి 1000 నుంచి 2000 ఆపై రూపాయలు వసూలు చేస్తేనే కందూర్లు సమర్పించుకుంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. కొబ్బరికాయ కొట్టడానికి కూడా 45 నుంచి 50 వంద రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కేశనఖండన కోసం 200 రూపాయల నుంచి ఆపై రూపాయలు అదే విధంగా మేక తల కోసం, మేక కొయ్యలన్న 300 రూపాయల నుంచి 400 రూపాయలు వసూలు చేస్తున్నారని ,తాగునీటి కోసం 20 నుంచి 30 రూపాయలు స్నానపు నీటి కోసం 50 రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా చిరు వ్యాపారస్తుల నుంచి, ఇతర వ్యాపారస్తుల నుంచి భారీగా కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా స్నానపు నీటి కోసం ,కొనుగోలు చేయాల్సిన దుస్థితి పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఉంటుందని భక్తులు ఆరోపిస్తున్నారు. మురికి కాలువల్లో భక్తులు స్నానం చేసి తమ మొక్కు బడులు తీర్చుకుంటున్న వైనం నెలకొంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం టెండరు మూడు కోట్ల నలభై లక్షలకు పాడగా ఈసారి మూడు కోట్ల 60 లక్షల టెండర్ హస్తగతం చేసుకున్న కాంట్రాక్టర్ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. పైన కొండపైకి వెళ్లాల్సిన మెట్లు సరిగా లేవని భక్తులు కాలినడకన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రాంగణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని మురికి నీరు చెత్తాచెదరం అస్తవ్యస్తంగా ఉండడం దుర్వాసన వస్తుందని క్రిమి కీటకాలు వెదజల్లే పరిస్థితులు రోగాల బారిన పడుతున్న వైనం నెలకొంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుకోవాలన్న అదేవిధంగా నీరు కావాలన్నా వాటికి 50 నుంచి వంద రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణం 711 ఎకరాలు ఆవరించి ఉండగా ఈ భూమి మొత్తం రెవెన్యూ వ్యవస్థ మాదని అదేవిధంగా ఫారెస్ట్ వ్యవస్థ మాదని వక్కు బోర్డ్ వ్యవస్థ మాదని ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు కానీ ఈ భూమి ఎవరిది అని ఇప్పటికీ తేల్చలేని వైనం నెలకొంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణం కు చెందిన భూమి ఎవరిది అని తేలక పోవడం, పుణ్యక్షేత్ర ప్రాంగణంలో హంగు అర్బడాలతో ఎవరు బడితే వారు ఇష్టానుసారంగా ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని గదులు ఏర్పాటు చేసి వాటి నుంచి అద్దె రూపంలో సుమారు 1000 నుంచి 2000 ఆపై రూపాయలు వసూలు చేస్తూ భక్తుల జేబులను ఖాళీ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కనీసం ఈ ఇండ్ల నిర్మాణం కోసం గ్రామపంచాయతీ నుంచి కానీ వక్కు బోడు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ ఫారెస్ట్ వ్యవస్థ నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇల్లు నిర్మించడం వల్ల ప్రభుత్వ ఆదానికి గండిపడుతుందని టెక్స్ట్ లు లేకపోవడంతో ఇటు పంచాయతీ ఆదాయానికి గండి పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా ఇండ్ల నిర్మాణం చేస్తూ గదులు నిర్మించుకుంటున్నారని టెక్స్సులు కట్టడం లేదని దీంతో పంచాయతీ ఆదాయానికి పూర్తిగా లాస్ వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఐదు ధర్మశాలలు ఉన్నాయని ఇది పేద, మధ్యతరగతి భక్తుల కోసం ఏర్పాటు చేసినప్పటికీ ఈ ధర్మశాలలు అస్తవ్యస్తంగా మారాయని రేకులు ఊడిపోయి ఏళ్లు గడిచిన దీని గురించి పట్టించుకునే నాధులు లేరని కోట్ల రూపాయలు ఆదాయం పుణ్యక్షేత్ర ప్రాంగణానికి వస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదని ఎలాంటి వసతులు భక్తులకు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఐదు ధర్మశాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని పెచ్చులు ఊడిపోయాయని రేకులు ఊడిపోయాయని భక్తులకు ఉండడానికి సౌకర్యం లేదని దీంతో అదే గృహాలలో ఉండి భారీగా డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వక్కు బోర్డు కార్యాలయం అర్ధాంతంగా పనులు ఆగిపోయాయని పై ఒకటో అంతస్తు ఇప్పటికీ పూర్తి కాలేదని. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో సీసీ కెమెరాలు గతంలో ఉండేవని ప్రస్తుతం పని చేయడం లేదని సీసీ కెమెరాలు ఉన్న అవి పని చేయకపోవడంతో అక్కడ ఏమి జరుగుతుందని ఎవరికీ తెలియడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాలకులు, అధికారుల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఒక సంవత్సరం ఈ కమిటీ మంచిగా నడుస్తున్నప్పుడు అప్పుడు ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని. దోపిడీ కూడా జరగలేదని దర్గ వద్ద భక్తుల నుంచి ఖుషి గా ఇచ్చిన డబ్బులు లెక్క చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని. అయితే ఎన్నో రోజులు ఈ వ్యవస్థ ఉండకుండానే కమిటీ రద్దు అయిపోయిందని మళ్లీ యధా రాజాతాదా ప్రభ అన్న చందంగా కాంటాక్ట్ వ్యవస్థ దోపిడి వ్యవస్థ మళ్లీ పుట్టుకో వచ్చిందని ఏళ్ల నుంచి వస్తున్న దోపిడీ మళ్లీ కొనసాగడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓలే కమిటీ నడిస్తే ఇలాంటి అవినీతి అక్రమాలు దోపిడీ జరగదని భక్తులకు మంచి సౌకర్యం కలుగుతుందని న్యాయం జరుగుతుందని ప్రజలు తెలుపుతున్నారు.
నేటి నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభం మూడు రోజుల ఉత్సవాలు
పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులుగా ఉర్సు చాల ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉర్సు జలాల్పూర్ ముజావర్ ఇంటి నుంచి హుంట్, గుర్రంపై గంధం తీసుకొని పెద్దగుట్టకు ప్రయాణమవుతారు. కచేరి వద్ద సుమారు గంట నుంచి గంటన్నర వరకు, భక్తి పాటలతో అలరింపచేసి గంధం, ఉంటూ గుర్రాలతో ప్రారంభమై బయలుదేరుతుంది. ఈ సందర్భంగా ఫకీర్ల విన్యాసం భక్తులకు ఆకట్టుకుంటుంది. బ్యాండు మేళాలు భాజా భజంతుల మధ్య భారీగా ఉర్సు ఉత్సవాలు జలాల్పూర్ నుంచి పెద్దగుట్టకు బయలుదేరి వెళుతుంది. సాయంత్రం ఈ ఉర్సు బయలుదేరి కొండపైకి వెళ్లి అక్కడ గంధం దర్గాకు సమర్పిస్తారు. రెండవ రోజు ధూప దీప నైవేద్య కార్యక్రమం ఉంటుంది మూడో రోజు కవాలి ముగింపు కార్యక్రమం ఉంటుంది ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో బోధన్ ఆర్డీవో రాజగౌడ్ ఏసిపి కిరణ్ కుమార్లు పర్యవేక్షణ చేస్తూ కట్టుదిట్టమైన భద్రత అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.
ఉర్సు ఉత్సవాల కోసం వక్కు బోర్డుకు 16 లక్షల రూపాయలు మంజూరైనప్పటికీ సౌకర్యాలు ఏమీ కల్పించడం లేదని నామాత్రంగా సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రజలు భక్తులు ఆరోపిస్తున్నారు. మెట్లు మరమ్మత్తులు చేయలేదని నీటి సౌకర్యం సక్రమంగా లేదని పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని మురికి ఎక్కడ పడినా అక్కడ ఉందని దీంతో భక్తులు చాలా ఇబ్బందులు పడవలసిన అవకాశాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ధర్మశాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని భక్తులు ఉండడానికి ఎలాంటి సౌకర్యం లేదని అద్దే భవనంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అద్దే మాత్రం 1000 నుంచి 2000 ఆపై రూపాయలు గదులు చూసి ఉన్నాయని దీంతో భక్తులు ఇబ్బందులు ఎదురుకోవలసిన పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దగుట్ట పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి అదేవిధంగా బాన్సువాడ నుంచి బడాపాడుకు వచ్చే ప్రధాన రహదారి అద్వానంగా మారిందని చుట్టుపక్కల మొరం అస్తవ్యస్తంగా వేశారని ప్రమాదాలు జరిగే అవకాశాలు తీవ్రంగా ఉన్నాయని అదే విధంగా మూలమలుపుల వద్ద ప్రమాదపు సూచికలు ఏర్పాటు చేయలేదని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు బస్సు సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉందని ప్రవేటు వాహనాలను ఎక్కి దోపిడీకి భక్తులు గురి కావలసిన అవసరం ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పెద్దగుట్టకు వెళ్లే పైపు లైను నీటి సౌకర్యం లీకేజీ అయిందని, నీరు కలిసి తమవుతుందని దీని గురించి పట్టించుకునే నాధుడు లేరని పలువురు ఆరోపిస్తున్నారు. వీటి పై ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని భక్తులకు న్యాయం చేకూర్చాలని పలువురు కోరుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్న పని చేయటం లేదని అదే విధంగా పోలీసు ఉపహార ఏర్పాటు చేయాలని. కాంట్రాక్టర్ల నిలువు దోపిడీ ఆపాలని ప్రజలు వ్యాపారస్తులు కోరుతున్నారు. బడాపాడు పుణ్యక్షేత్రం కింద రామన్న లంక ఉంటుందని ఇక్కడ దైవ దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని , రామన్న లంక కోసం ఎవరైతే పంతులు కాంట్రాక్ట్ తీసుకుంటారు ఉ
వారు సంవత్సరానికి లక్ష రూపాయలు జలాల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీకి లక్ష రూపాయలు చెల్లిస్తారు తప్ప, పెద్దగుట్ట పుణ్యక్షేత్రం నుంచి జలాల్పూర్ గ్రామపంచాయతీ ఎలాంటి ఆదాయం ఉండబోదని ప్రజలు తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చిందని ఈ ప్రభుత్వ హయం లోనైనా పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు అదేవిధంగా న్యాయం చేకూర్చడంలో పని చేస్తుందా ఎదురు చూడాలని పలువురు ఎదురుచూస్తున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....