V1News Telangana

రామగుండం కార్పొరేషన్ లో డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తాం 20 లక్షల నిధులతో రోడ్డు పనులు ప్రారంభం

రామగుండం కార్పొరేషన్ లో డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తాం

20 లక్షల నిధులతో రోడ్డు పనులు ప్రారంభం

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 12:-

రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు కల్వర్టులు, రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ… గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్ లు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నాయన్నారు. ప్రణాళికతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుతామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా పాలన తీసుకువస్తామని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేరుగా ప్రజలు నా దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి పాటుపడతామన్నారు. 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి- ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్,మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ ఏఈ, డిఈ తో పాటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?