నసురులాబాద్ మండల కేంద్రంలోని మైలారం లోగల అడవి ప్రాంతంలోనీ పంట పొలాల్లో కొందరు జూదం నిర్వహిస్తున్నట్టు విశ్వాసనీయ సమాచారం. మైలారం అడవి ప్రాంతంలో జరుగుతున్న జూదాన్ని ఆడడానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి తరలివస్తున్నారట. జూదం మత్తులో మునిగి తమ దగ్గర ఉన్న ద్విచక్రపు వాహనాలను తాకట్టు పెట్టి, ఇంట్లో ఉన్న అభరణాలను సైతం తాకట్టు పెట్టి పేకాట ఆడడానికి మైలారం గ్రామానికి కొందరు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
మరి మైలారం గ్రామంలో పేకాట ఆడిపిస్తున్నది ఎవరు అసలు ఇంత జరుగుతున్న సంబంధిత శాఖకు ఈ విషయం తెలియలేదా జూదం ఆడుతున్నది వాస్తవమేన అనే ప్రశ్నలు పుకార్లుగా వినబడుతున్నాయి. ఒకవేళ మైలారం గ్రామంలోని అడవి ప్రాంతాల్లో పేకాట నడుస్తున్నట్టు నిర్ధారణ అయితే సంబంధిత అధికారులు వాళ్లపై ఉక్కు పాదం మోపుతారా లేదా వేచి చూడాల్సి ఉంది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








