నా భూములను కబ్జా చేసుకోవడమే కాకుండా నాపై దాడి చేశారు…..
ఒక మహిళ అని చూడకుండా రుద్రూర్ ఎమ్మార్వో ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్గా పని చేసే గైని ఈశ్వర్ విచక్షణ రహితంగా దాడి చేసి భూములు కబ్జా చేసుకుంటున్నాడు
ఆయనకు గోపాలమిత్ర సిబ్బంది తిరుపతి తో పాటు కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఆరైగా పనిచేసే పండరి తో మరికొంతమంది సహకరించి దాడులకు యత్నాలు చేస్తున్నారు
ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మహిళలపై దాడి చేయడంతో పాటు వారికున్న అధికారం అడ్డుపెట్టుకొని మా సొంత భూములు కబ్జా చేసుకుని ఇష్టానుసారంగా దుర్భషపదలతో దాడులు చేయడంతో పాటు, తమ కుటుంబం పై చంపుతామంటూ బెదిరిస్తున్నారు తమకు న్యాయం చేయండి
హుమ్నాపూర్ లో టెంట్ వేసి బాధిత కుటుంబీకులు నిరసన…
20 సంవత్సరాలుగా వారు నాకు సతాయిస్తున్నారు ,రెండు సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాను, పోరాడుతున్నాను, అయినా కనికరం లేకుండా నాపై దాడులు దుర్భష పదజాలతో దూషిస్తున్నారు.
వారిపై వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నిజాంబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ ,ఆర్ఐ పండరి కామారెడ్డిలో, గోపాలమిత్ర అసిస్టెంట్ తిరుపతి గుండాయిజం రౌడీయిజం చలయిస్తూ మమ్ముల్ని సంపుతామంటున్నారు మాకు రక్షణ ఇవ్వండి,,
బాధితురాలు గైని రేఖతోపాటు కుటుంబీకులు
వర్ని, హుమ్నాపూర్
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన గైని రేఖ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలోని బాపూజీ అదే విధంగా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట టెంట్ వేసి నిరసన చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు గైని రేఖ మాట్లాడుతూ
తనకు సొంత భూమి ఉందని అలాంటి సొంత భూమిని రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసే గైనీ ఈశ్వర్ అక్రమంగా కబ్జా చేసుకుని, వర్ని తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా ఉన్నప్పుడు ఫోర్జరీ సంతకాలు చేసి, అక్రమంగా కబ్జా చేసుకున్నాడని నాతోపాటు ఇంకా గ్రామంలో ఎంతోమంది ఫోర్జరీ సంతకలతో భూములు కబ్జా చేసుకున్నాడని, ఫోర్జరీ సంతకలతో అక్రమంగా కబ్జా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గత రెండు సంవత్సరాల నుంచి తాను ఉద్యమిస్తున్నానని, కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నానని, ఈ సందర్భంగా గ్రామంలోని టెంట్ వేసి నిరసన చేస్తున్నానని తెలిపారు. గత రెండు రోజుల క్రితం తన వ్యవసాయ పొలంలో వెళ్లి పనులు చేస్తుండగా ఈశ్వర్ ప్రభుత్వ ఉద్యోగి తనపై ఒక మహిళ అని చూడకుండా దుర్బష పదజాలలతో దూషించడమే కాకుండా విచక్షరహితంగా దాడి చేశాడని ఈ విషయంలోనే గ్రామంలో దండోరా వేయించి పంచాయతీ నిర్వహిస్తే ,అక్కడ సైతం నాపై దాడి చేయడమే కాకుండా నా భర్త, నా పిల్లలపై కూడా దాడి చేశాడని నాతో వచ్చిన చుట్టాలపై కూడా దాడులు చేయించాడని, కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్ఐగా పని చేసే పండరి సైతం ఆయనతోపాటు వెటర్నరీ గోపాలమిత్ర వర్నిలో పనిచేసే తిరుపతి తో పాటు ఇంకొంతమంది గుండాలు కలిసి గుండాయిజం ,రౌడీయిజం చేసి నాతోపాటు నా భర్త సాయిలు తోపాటు నా పిల్లలపై కూడా నా చుట్టాలపై దాడి చేసి విచక్షణ రహితంగా బూతు పదజాలతో దూషించారని ,చంపుతామని బెదిరిస్తున్నారని మాకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి అంటూ వర్ణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి గ్రామం తో పాటు పలుచోట్ల న్యాయం కావాలని ఉద్యమిస్తున్నాను అని ఇంకా న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటా అంటూ ఆమె పేర్కొంది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....