బాన్సువాడ V1 న్యూస్ : – బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో ఎస్.ఎన్.పురం వర్ని నేమాని నాగమణి వీర్రాజు (బుజ్జి ) దంపతులు, ఎస్.ఎన్ పురం గ్రామ యువకులు సోమవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవిందర్ రెడ్డి, ఆయన సతీమణి మంజుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి గెలుపుకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు, గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్, సీనియర్ నాయకులు మైలారం భాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గంగా ప్రసాద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు బాణోత్ రమేష్, వర్ని మండల ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబు, సొసైటి డైరెక్టర్ గంగప్ప, సీనియర్ కాంగ్రెస్ మోహినోద్దీన్, మాజీ వర్ని టౌన్ అధ్యక్షులు బారి, మండల కార్యదర్శి భీమశంకర్, జాకోరా మైనార్టీ గ్రామ అధ్యక్షులు బషీర్, మనవర్తి శ్రీనివాస్, అజయ్, చక్రధర్, దామినేని నాగేశ్వరరావు, ఏలేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Author: Thatipamula Rajashekhar
PRESS