బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రతినిధి గుగల్లోత్ సుగుణ
V1 న్యూస్ :- నసురుల్లాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగల్లోత్ సుగుణ ఆధ్వర్యంలో బొప్పాసుపల్లి , లింగంపల్లి తండా, మైలారం తండా, సంగం తండా, అంకోల్ తండా, రాములా గుట్ట తండా పర్యటించి బిజెపి మ్యానిఫెస్టోని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో బిజెపి గెలుపు ఖాయం అన్నారు నరేంద్ర మోడీ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకలు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాయని అన్నారు భారత రాష్ట్రపతిగా ద్రౌపతి మూర్మ గారిని చేసినందుకు ఓటు వేసి రుణం తీర్చుకుంటామని గిరిజనులు మద్దతు తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు, దేవసోతు సురేఖ, జి. పుష్పలత,శంకర్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు దేవిసింగ్, మోహన్, సునీల్, దేవిసింగ్, అనిల్, రవి,జామున రాందాస్ తదితరులు పాల్గొన్నారు

Author: Thatipamula Rajashekhar
PRESS