ప్రజా ఆశీర్వాదయాత్రలో ముందుకు దూసుకెళుతున్న సోమారపు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 02:-
స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగన సోమారపు సత్యనారాయణ ప్రచారం లో ఈ రోజు 20 వ డివిజన్ అక్బర్ నగర్,రైల్వే స్టేషన్,భరత్ నగర్,ఎస్ సి కాలనీ లలో ప్రచారం కొనసాగించారు, తాను రామగుండంలో ప్రతి ఇంటి ఇంటికి 24 గంటలు మంచి త్రాగునీరు అందించానని,రామగుండం రైల్వే స్టేషన్ మసీదుకు సరిపడా నిధులు కేటాయించామని,రోడ్లు,డ్రైనేజీలు పూర్తిచేశానని మెరుగైన పారిశుద్ధాన్ని అందించానని తెలిపారు,చాలామంది ప్రజలు యువకులకు చదువుల కోసం గానీ ఉద్యోగుల కోసం ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే నిత్యం రైల్వే గేట్ ఉండడం వల్ల ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు ఆ సమస్య నుంచి పరిష్కరించి తన చొరవతో నే రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేశానని తద్వారా ప్రతి ఒక్కరూ వారి యొక్క గమ్య స్థలాన్ని చేరుకున్నారని తెలిపారు,అందరు కలసి కట్టుగా పనిచేసి తిరిగి గెలిపిస్తె ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, ఇది నాకు చివరి ఎలక్షన్స్ అనిమీరు ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో రామగుండం ప్రాంతాన్ని గతం కంటే మెరుగ్గా తీర్చి దిద్దుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య మాజీ మేయర్ రాజమణి,కుసుమ, కోదాటి ప్రవీను,రాయమల్లు గౌడ్,శశి,ఆఫీజ్,అభిలాష్ కృష్ణ,బిక్షపతి,బండారి రాయమల్లు, వీరన్న,డీటి వెంకటస్వామి సురేష్ పటేల్,చంద్రశేఖర్ గౌడ, కిషన్ రావు,సత్యం,రాయాలింగు డేవిడ్, ,తాజు,అరవింద్,కృప,సాగర్ ,సూరి,కిషోర్,కృప,శ్యామ్ రాజ్ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM