ఎమ్మెల్యే పేరుతో వార్డులలో ఆ నాయకులు డెవలప్మెంట్ చేసుకున్నారా…?
గతంలో ఎమ్మెల్యే పాలన బాగుందన నాయకులు ఇప్పుడు పార్టీ మారింది వారి స్వార్ధ లాభాలకోసమేనాని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కొందరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో వెళ్లడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని లక్షల నిధులతో పనులు తమ వార్డులలో చేసుకొని స్థానిక ఎమ్మెల్యేకు షకీల్ అమీర్ కు మరియు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపిన ఈ నాయకులు ఇప్పుడేమో వారు ఏమి చేయలేదని తమే స్వతహాగా వార్డులలో డెవలప్మెంట్ చేసుకున్నాం అంటూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వార్డులలో అభివృద్ధి జరిగింది బిఆర్ఎస్ పార్టీతోనేనని ప్రజలంతా గ్రహిస్తున్నారని రానున్న రోజుల్లో అభివృద్ధిని చూసి ఓటేస్తాం కానీ వ్యక్తిని చూసి ఓటేయమని కొందరు బోధన్ స్థానికులు తెలుపుతున్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist