Post Views: 91
బోధన్ V1 న్యూస్ అక్టోబర్ 31: – బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షతులై బోధన్ పట్టణంలోని 16 వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి మంగళవారం బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వీఆర్. దేశాయ్, బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సునీత దేశాయ్ ,16 వ వార్డు కౌనిలర్ కొండ్రా పద్మ ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. బీఆర్ ఎస్ లోకి చేరిన వారిలో సాయికుమార్, వాణి,గంగ పుత్ర ,యూత్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన భారత్, సాయికుమార్, రాజు, సుశీల, గంగారాం, వివిధ పార్టీలకు చెందిన 20 మంది యువ నాయకులు, మహిళలు ఉన్నారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Author: Thatipamula Rajashekhar
PRESS