బోధన్ : ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ గ్రామ శివారులో ఉన్నటువంటి ఇటిక బట్టీల యజమానుల ఇష్టరాజ్యం నేనే మంత్రి నేనే రాజు అన్న చందంగా నడుస్తుంది.కరెంటు ఫ్రీ,నీళ్లు ఫ్రీ అన్ని ఫ్రీ అన్న విధంగా ఇట్టికబట్టిల వ్యవహారం ఉంది.ఏంటి ఇది అని ప్రశ్నించడంతో బోధన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు చెబుతూ ఈ ఫ్రీ వ్యవహారం నడుస్తుంది.అదేవిధంగా ఈ ఇటుక బట్టిలలో మైనర్లు మగ్గుతున్నారు.

ఇక మట్టి విషయానికి వస్తే ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలలో మట్టి తోలుతూ ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి కొడుతున్నారు.వారు నిర్ణయించిందే ధర అన్న చందంగా ఏఆర్పి క్యాంప్ ఇటిక బట్టీల యజమానుల వ్యవహారం కళ్ళకు కట్టుతుంది.

అదేవిధంగా నిజాంసాగర్ కాలువ స్థలాన్ని రోడ్డుగా వాడుకుంటూ ఇస్టారీతిలో వ్యవహరిస్తున్నారు.సంబంధిత అధికారుల సైతం మౌనంగా ఉండడం పై స్థానిక ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ శివారులో ఉన్నటువంటి రైతులు సైతం ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు.విద్యుత్ అధికారులతో పాటు సంబంధిత అధికారులు ఏఆర్పి క్యాంప్ ఇటిక బట్టీల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








