కోటగిరి
విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదివి వృద్ధిలోకి, అభివృద్ధిలోకి రావాలని అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వాసు బాబు అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ వసతి గృహంలో సుమారు 200 మంది విద్యార్థినులకు పెన్నులు, పుస్తకాలు, నోటుబుక్కులు ఇతర సామగ్రిలు ప్రముఖ సామాజిక వేత్త ముమ్మలేని రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అడ్డకాస్ పల్లి గ్రామంలో సుమారు 2 కోట్లకు పైగా వెచ్చించి మందిరం నిర్మించిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారి సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ,ప్రజలకు సేవలు అందించడంలో ముందుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ నగర్, సర్పంచు హనుమంతు ఇతరులు ఉన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








