Post Views: 160
బీహార్ రాష్ట్రం లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంజ్లిస్ పార్టీ మరోసారి సత్తా చాటుకుంది. బీహార్ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది. గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న బీహార్ లో సత్తా చాట లేకపోయిందని బోధన్ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మీర్ ఇల్యాస్ అలీ తెలిపారు. బీహార్ ఎన్నికల్లో మాంజ్లిస్ ఇతేహదూల్ ముస్లిం పార్టీ గెలిచిన సందర్బంగా ఈ రోజు బోధన్ ఎంఐఎం పార్టీ కార్యలయంలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమం లో బోధన్ పట్టణ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మీర్ ఇల్యాస్ అలీ,జనరల్ సెక్రటరీఅహ్మద్ బిన్ మోసిన్,జాయింట్ సెక్రటరీఅఖీల్ ఫారూకీ హాజీ,అబ్దుల్ ఉమర్,అబ్దుల్ రషీద్,సమీర్,రషీద్,ఖాదీర్ ఖాన్,సలాం చౌస్,మొహమ్మదు ఖిజర్ మాజీ అత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








