V1News Telangana

best news portal development company in india

*స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్*

SHARE:

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా జరిగే మండల, జిల్లా, ప్రజా పరిషత్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చెయ్యనుంది,రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.

గురువారం ఉదయం 10.30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 11 వరకు నామి నేషన్ల స్వీకరించనున్నారు. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 15 వరకు గడువు నామినేషన్ల ఉపసంహరణ కు గడువు విధించను న్నారు.

ఈనెల 23న మొదటి విడత MPTC, ZPTC పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్‌ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి విడత లో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జడ్పీ టీసీల కోసం జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో నామి నేషన్లు స్వీకరించనున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india