V1News Telangana

best news portal development company in india

స్థానిక రిజర్వేషన్ల ఖరారు…. తీవ్ర నిరాశలో బోధన్ సాలూర మండలాల నేతలు. 🔹 రిజర్వేషన్ల డిక్లరేషన్ డ్రా పద్ధతిలో చేయవచ్చా? 🔹 గ్రామ పంచాయతీ,జడ్‌పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీ స్థానాల్లో ఊహించని మార్పులు 🔹 అధికార–ప్రతిపక్షాలకు వ్యూహాల మార్పు తప్పని స్థితి 🔹 ఎన్నికల సమీకరణాల్లో తారుమారు – రాజకీయ అంచనాలకు భారీ షాక్..

SHARE:

‌బోధన్, సెప్టెంబర్ 27:
పంచాయతీ రిజర్వేషన్ల తాజా ప్రకటనతో అభ్యర్థుల ఆశలు తారుమారయ్యాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ పదవుల కోసం కృషి చేసిన నేతలకు ఈ రిజర్వేషన్లు నిరాశను కలిగించాయి.
జిల్లా పంచాయతీ అధ్యక్ష పదవి దక్కించుకోవాలనుకున్న పలువురు నేతలకు ఈ రిజర్వేషన్లు షాక్ ఇచ్చాయి. బోధన్ నుంచి పోటీ చేయాలని భావించిన అనేక గ్రామ స్థాయి నాయకుల ప్రణాళికలు వాయిదా పడ్డాయి.
కొన్ని మండలాల్లో గత ఎన్నికల ఫలితాల ఆధారంగా లెక్కలు వేసుకున్న నేతలకు ఈసారి వచ్చిన రిజర్వేషన్లతో పెద్ద తేడా తలెత్తింది. బాన్సువాడ నుంచి పోటీ చేయాలని భావించిన కాంగ్రెస్ నాయకులు, బోధన్ నుంచి ప్రయత్నించిన టీడీపీ నేతలు కూడా ఈ కొత్త రిజర్వేషన్లతో నిరాశ చెందారు.
సాలూరు, ఎండీడ్, జడ్‌పీటీసీ స్థానాలపై ఆధిపత్యం సాధిస్తామని భావించిన నేతలు ఇప్పుడు కొత్త వ్యూహాలు రచించాల్సి వస్తోంది. అధికార పార్టీకి కూడా ఊహించని విధంగా షాకులు తగిలాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ రిజర్వేషన్లు రాబోయే ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చేస్తాయని అంచనా. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india