సాలూర, సెప్టెంబర్ 26:
సాలూర మండల కేంద్రంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరిస్తూ నేతలు మాట్లాడుతూ – “భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల గర్వంగా నిలిచారు. ఆమె స్ఫూర్తితో యువత ముందుకు రావాలి” అన్నారు.
ఈ వేడుకల్లో ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ శశిభూషణ్, పిఎసిఎస్ చైర్మన్ అల్లె జనార్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్న రవి, సీనియర్ నాయకులు అల్లె రమేష్, ఇల్తె శంకర్, ఖజాపూర్ అనిల్, డిస్కో సాయిలు, మైదాపు నాగరాజు, గాండ్ల రాజేశ్వర్, ఖజాపూర్ అశోక్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సింగడి పాండు, రజక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








