Post Views: 104
బోధన్ పట్టణం:రాబోయే మూడు నుంచి నాలుగు గంటల్లో బోధన్ పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు తప్ప ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. అత్యవసర సేవల కోసం మున్సిపాలిటీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రజలు సహాయం కోసం +91 63052 49776 నంబర్కి సంప్రదించవచ్చని వివరించారు.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, వర్షాల తీవ్రత తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








