– మానవత్వంతో స్పందించి అందరూ కలిసి నగదు సమీకరణ చేసిన వైనం
– రూ.15000 మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం అందచేత
– పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న నసురుల్లాబాద్ గ్రామస్తులు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా : నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు గ్రామంలో గత మూడు రోజుల క్రితం మరణించిన మేదరి రాములు కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ఆర్థిక సహాయం అందించారు.. గ్రామంలో మరణించిన నిరుపేద కుటుంబాలకు మానవతా దృక్పథంతో తమ వంతు సహకారం అందిస్తూ సమిష్టిగా గ్రామ ప్రజలు అందరూ కలిసి నగదు సమీకరణ చేసి దినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు..మనం చేసే సహాయం పలువురికి ఆదర్శంగా నిలవాలని “ఆలయానికి ఎన్ని లక్షలు ఇచ్చినా భక్తుడు అంటారని- ఆపదలో ఉన్న వ్యక్తికి పది రూపాయలు సహకరించినా దేవుడు అంటారని” నినాదంతో ముందుకు సాగుతున్నామని గ్రామస్తులు తెలిపారు .. భవిష్యత్తులో గ్రామంలో మరణించిన ప్రతి కుటుంబానికి ఇదేవిధంగా తమ వంతుగా సహాయం అందిస్తామని అందులో భాగంగానే గత మూడు రోజులుగా అందరూ కలిసి పోగుచేసిన రూ. 15000 బాధిత కుటుంబానికి అందజేసి వారిని ఓదార్చారు..ఈ కార్యక్రమంలో అరిగె సాయిలు , వనం వెంకటేశ్వర్ రావ్, మోసిన్,ఫయాస్, చాకలి సాయి, టేకుర్ల సాయిలు,మంగలి సాయికుమార్,దాది మల్లేష్, అరిగె రవి, తర్ణం పోచయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








