V1News Telangana

best news portal development company in india

ఇసుక మాఫియాపై ఎమ్మార్వో గర్జన: రెండు ట్రాలీలు పట్టివేత..

SHARE:

సాలూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్
.
ఇసుక దందాకు చెక్: ఎమ్మార్వో శశిభూషణ్ హెచ్చరిక
. ఇసుక తవ్వకాలపై ముట్టడి – సాలూరు ఎమ్మార్వో గట్టి హెచ్చరిక
. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి: ఇసుక మాఫియాకు గట్టిగా ఎంఆర్ఓ..

 

సాలూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఎట్టకేలకు కళ్లెం కట్టారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రంలో అనుమతులు లేని రెండు ఇసుక ట్రాలీ ఆటోలను ఆర్‌ఐ ఆనంద్ పట్టుకొని, సాలూరు ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు. అనంతరం సదరు ట్రాలీలను అధికారులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా మండల ఎమ్మార్వో వై. శశిభూషణ్ మీడియాతో మాట్లాడుతూ, “ఇకపై ఇసుక రవాణా విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర చర్యలు తీసుకోక తప్పదు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ట్రాక్టర్లు, ఆటోలపై కఠినంగా వ్యవహరిస్తాం” అని హెచ్చరించారు.
ఇప్పటికే మండలంలో ఇసుక రవాణా పేరుతో కొన్ని వాహనాలు నిబంధనలను బేఖాతరు చేస్తుండటంపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఈ చర్యతో అక్రమాలపై కఠిన హెచ్చరిక వెళ్లినట్లు స్పష్టమవుతోంది.

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

best news portal development company in india